అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె మండలంలోని అనంతపురం గంగమ్మ దేవాలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. మొదట అమ్మవారిని అభిషేకించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ధ్వజస్తంభం వద్ద అమ్మవారికి టెంకాయలు కొట్టి భక్తులు కోర్కెలను తీర్చమని మొక్కుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ పూజారి తీర్థప్రసాదాలు అందజేశారు.