Ys jagan : మార్చి 2 నుంచి గోరుముద్ద మెనూలో రాగిజావ
మార్చి 2 నుంచి జగనన్న గోరుముద్ద మెనూలో రాగిజావ అందించనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యముంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో శ్రీ సత్యసాయి ఛారిటబుల్ ట్రస్టు సహకారంతో ఒప్పందం చేసుకున్నారు.
మార్చి 2 నుంచి జగనన్న గోరుముద్ద( Jagananna Gorumudda) మెనూలో రాగిజావ (Ragijava)అందించనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యముంత్రి జగన్ మోహన్ రెడ్డి ( Cm jagan)సమక్షంలో శ్రీ సత్యసాయి ఛారిటబుల్ ట్రస్టు సహకారంతో ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44,392 స్కూళ్లలో 37,63,698 విద్యార్ధులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. రోజు వారీ అందిస్తున్న మెనూతో పాటు- పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారంలో 5 రోజులు గుడ్డు, మూడు రోజులు బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వాలని నిర్ధేశించామన్నారు. బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వని రోజుల్లో పిల్లలకు తగినంత ఐరన్, కాల్షియం (Iron and calcium) అందించేందుకు వీలుగా చిరుధాన్యాలను మధ్యాహ్న భోజన పథకంలో భాగం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందులో భాగంగానే జగనన్న గోరుముద్దలో రాగిజావ అందించేందుకు నిర్ణయం తీసుకు న్నట్లు తెలియజేశారు. రాగిజావను అదనంగా చేర్చడం ద్వారా మరింత పౌష్టిహాకారం పిల్లలకు అందుతుందన్నారు.
కేవలం గోరుముద్ద కార్యక్రమానికే రూ.1700 కోట్లు- ఖర్చు పెడుతున్నట్లు ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమం. బడి ఈడు పిల్లల్లో(Enrollment) ను పెంచటడంతో పాటు వారిలో డ్రాపౌట్స్ (Drop outs)ను తగ్గించే కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు స్కూల్ లో రుచికరమైన పౌష్టికాహారాన్ని( Nutritious food) మధ్యాహ్న భోజనంతో అందిస్తోంది. ఈ పధకన్ని1 నుంచి 10 వ తరగతి వరుకూ అమలు చేస్తోంది. రోజు వారీ అందిస్తున్నా మెనూతో పాటు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారంలో 5 రోజులు గుడ్డు, మూడు రోజులు బెల్లం,పల్లీ చిక్కీ ఇవ్వని రోజుల్లో అందుకు పిల్లలకు తగినంత ఐరన్, కాల్షియం అందించేందుకు వీలుగా చిరుధాన్యాలను మిడ్ మీల్స్ లో( mid dau meal) భాగం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా నే…జగనన్న గోరుముద్దలో రాగిజావను మెనూలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వారానికి మూడు రోజుల పాటు రాగిజావను మిడ్ డే మీల్స్లో భాగం చేశారు. ఈ కార్యక్రమం అమలు కోసం వివిధ స్వచ్ఛంద సంస్ధల బాగస్వామ్యం కూడా తీసుకోవాలని నిర్ణయించారు.
దీంతో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మిడ్ డే మీల్స్లో పిల్లలకు రాగిజావ అందించే కార్యక్రమంలో భాగస్వామి అయింది.విద్యారంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టాం. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్నివ్వడానికి ఉద్దేశించిన అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే.. నాడు– నేడు ద్వారా స్కూళ్ల వ్యవస్ధను మార్పు చేసే కార్యక్రమం చేస్తున్నామని సీఎం అన్నారు. 6వతరగతి ఆ పై తరగతుల్లో ప్రతి తరగతి గదిలో డిజిటిల్ స్క్రీన్ ఐఎఫ్పి ఏర్పాటు చేస్తున్నాం. 30,230 తరగతి గదుల్లో ఈ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్పి)లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. నాడు–నేడు (Nadu needu)తొలిదశ పూర్తి చేసుకున్న సుమారు 15వేల స్కూళ్లలో ఈ జూన్ నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నారు .వీటితో పాటు పిల్లలకు విద్యాకానుక, గోరుముద్ద, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్, బైలింగువల్ టెక్ట్స్బుక్స్, (Bilingual Textbooks )3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్, 8వతరగతి పిల్లలకు ట్యాబులు పంపిణీ వంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడతున్నారు. పిల్లల కరిక్యులమ్ను బైజూస్ కంటెంట్తో అనుసంధానం చేస్తూ.. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాం” అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.