NDL: రాష్ట్రంలో రైతులను అన్ని విధాల ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బుడ్డా పేర్కొన్నారు. మంగళవారం వెలుగోడు మండలం అబ్దుల్లాపురంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అధికారులతో కలిసి ఇంటింటికీ తిరిగారు. రైతుల కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ఆధారిత పంటల సాగు,అగ్రిటెక్,ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు.