తూ.గో: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారిని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వాదం అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.