KKD: 2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ 25వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్ సభలో మొత్తం 22 ప్రశ్నలు అడగటంతోపాటు 10 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు శాతం 85.29గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించారు.