ATP: గుంతకల్లులో MLA గుమ్మనూరు జయరాం ఇవాళ పర్యటిస్తారని క్యాంపు కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మ అర్పణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని, అలాగే 11.30గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమవుతారన్నారు. మధ్యాహ్నం 1 గంటకు మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు కేంద్రం కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.