ATP: టీడీపీ ముస్లింలకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నియోజకవర్గ ముస్లిం మైనార్టీ పెద్దలు, నాయకులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న స్థానిక, నామినేటెడ్ పదవుల్లో సముచిత న్యాయం కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు.