EG: పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కోరుతూ కొవ్వూరు ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆదివారం MLA ముప్పిడి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ డిమాండ్కు మద్దతుగా పట్టణంలో సేకరించిన 200 మంది సంతకాల పత్రాన్ని అందజేసినట్లు మద్దెల సత్యనారాయణ తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడికి ఇది తగిన గౌరవమని అన్నారు.