కోనసీమ: విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ YCP రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట ప్రకటించడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోన సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం మండపేటలో మాట్లాడుతూ.. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎన్నిసార్లు విద్యుత్ బిల్లుల్లు పెంచారో తెలుసుకోకుండా రోడ్డెక్కడం సిగ్గుచేటని అన్నారు. 8 సార్లు పెంచిన ఘనత వైసీపీదేనని కోన అన్నారు.