కృష్ణా: అవనిగడ్డ నూతన ఏజీపీ బొప్పన వెంకట సుబ్రహ్మణ్యేశ్వర రావును మండలి అభిమానులు సత్కరించారు. ఆదివారం స్వర్గీయ ఎంవీ కృష్ణారావు విగ్రహం వద్ధ అయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. డీసీ వైస్ ఛైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, సొసైటీ ఛైర్మన్ యలవర్తి చిన్నా, గాంధీ క్షేత్రం కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, టీసీ రవీంద్ర, బడే సుబ్బారావు, డేగల రాఘవ పాల్గొన్నారు.