ELR: కామవరపుకోట మండలం కళ్లచెరువులోని మాజీ ఏఎంసీ ఛైర్మన్ మేడవరపు అశోక్ ఇంట్లో వైసీపీ నేతల సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు హాజరయ్యారు. మండలంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మండలంలో పార్టీని ఎలా ముందుకు నడిపించాలి అనే అంశాలపై పలు సూచనలు చేశారు.