AKP: మంగళవారం నర్సీపట్నం జనసేన కార్యాలయంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జి సూర్యచంద్ర మున్సిపాలిటీతో పాటు వివిధ మండలాల నుంచి ప్రజల వినతులు స్వీకరించారు. విద్యుత్, పింఛన్, ఇళ్ల సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అందిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.