ATP: రాప్తాడు నియోజకవర్గంలోని భోగినేపల్లి గ్రామ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి రూ. 66 లక్షలు, పండమేరు వెంకటరమణ స్వామి ఆలయానికి రూ. కోటి నిధులు మంజూరయ్యాయి. దీంతో శుక్రవారం గ్రామ పెద్దలు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బోయపాటి సుధాకర్ నాయుడు తదితరులు మంత్రిని శాలువాతో సన్మానించారు.