VSP: డిజిటల్ వ్యవస్థ వల్లే స్త్రీలపై రోజురోజుకూ హింస పెరుగుతుందని ప్రగతిశీల మహిళా సంఘ ఉద్యమనేత సంధ్యా అన్నారు. ఈ మేరకు ఆదివారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జనరల్ కౌన్సిల్ సమావేశంలొ ఆమె మాట్లాడారు. స్త్రీలపై హింస కట్టడిలోప్రభుత్వాలు నియంత్రణలో విఫలమయ్యాయని విమర్శించారు. రోజూ మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.