GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జూలై 2025లో నిర్వహించిన PG రెండో సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను బుధవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. ఈ మేరకు M.A ఇంగ్లీష్ 96.67% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. జవాబు పత్రాల రీవాల్యుయేషన్ కోసం అక్టోబర్ 17లోపు ఒక్కొక్క సబ్జెక్టు రూ.1,860 చెల్లించాలని ఆయన తెలిపారు.