ASR: బాల్యవివాహాలు ఆపాల్సిన భాద్యత అందరిపై ఉందని, బాల్యవివాహాలు జరిపితే చట్టపరమైన చర్యలు ఉంటాయని అరకులోయ సీడీపీవో శారద హెచ్చరించారు. సోమవారం స్ధానిక FPO ఆఫీసులో జరిపిన కిశోరి వికాసం మండల స్ధాయి శిక్షణలో ఆమె మాట్లాడారు. శిక్షణలో రక్తహీనత, గృహాహింసా చట్టంపై అవగాహణ కల్పించారు. ఈ కార్యక్రమంలో లాయర్ సింహాచలం, జిల్లా బాలల పరిరక్షణ అధికారి సద్దు, కన్వినర్ ప్రసన్నకుమార్ ఉన్నారు.