పల్నాడు: వెల్దుర్తి మండల పరిధిలోని కండ్లకుంట గ్రామంలోని ఓ దేవాలయంలో శనివారం దొంగతనం జరిగింది. ఎస్సై సముందర్ వలీ తెలిపిన వివరాల మేరకు.. ఆలయ అర్చకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ మేరకు నిందితుడి నుంచి చోరీ చేసిన రూ.1,08,250 నగదు స్వాధీనం చేసుకుని సోమవారం కోర్టులో హాజరు పరుస్తామన్నారు.