కోనసీమ: చిత్తూరు జిల్లా సీనియర్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యను APWJF, బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ తీవ్రంగా ఖండించాయి. రావులపాలెం సీఐ శేఖర్ బాబుకు వినతిపత్రం అందజేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. విలేఖరి సుబ్రహ్మణ్యంపై దాడిని ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.