SKLM: నేర ప్రవృత్తికి స్వస్తి పలకి, సత్ప్రవర్తనతో నడుచుకోవాలి అని లావేరు ఎస్సై జి.లక్ష్మణరావు అన్నారు. ఆదివారం సాయంత్రం లావేరు పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఘర్షణలుకు దూరంగా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాలతో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.