పల్నాడు: ఎన్నికల ముందు తన సవాల్కు గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు స్పందించలేదని మాజీ MLA కాసు మహేశ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కాసు బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. ఎన్నికల ముందు పిడుగురాళ్ల ప్రభుత్వం మెడికల్ కాలేజీకి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైనట్లు యరపతినేని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశానన్నారు.