అనకాపల్లి: ఎస్ రాయవరం మండల పరిధిలో 15 టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి సౌజన్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీన మరో 24 టన్నులు ఎరువులు అందుబాటులోకి వస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు సరఫరా చేస్తామన్నారు .రబీ సీజన్లో పంటలు సాగు చేస్తున్న రైతులు వారికి అవసరమైన ఎరువులను విక్రయించనున్నట్లు తెలిపారు.