SKLM: విశ్వకర్మ జయంతి సందర్భంగా యజ్ఞోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలిరావాలని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతు పాపారావు పిలుపునిచ్చారు. ఇవాళ నరసన్నపేటలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17న యజ్ఞోత్సవం భూమి పూజ కార్యక్రమం ఉద్దండరాయపాలెం అమరావతిలో నిర్వహిస్తున్న సందర్భంగా పంచ వృత్తుల వారు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.