PPM: వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్ మోహన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా జగన్నాధపురం యూపీహెచ్సీలో నిర్వహించిన అవగాహన సదస్సులో బుధవారం ఆయన పాల్గొన్నారు. వృద్ధులకు ప్రత్యేకంగా వైద్య సిబ్బంది ఆరోగ్య తనిఖీలు చేపట్టారు. వారితో మాట్లాడి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు.