కోనసీమ: ఎవరైనా వాహనదారులు మద్యం సేవించి వాహనం ఎక్కితే జరిమానా పడడంతో పాటు జైలుకే అని ఎస్సై ఎం.అశోక్ హెచ్చరించారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలమూరు మండల పరిధిలోని వివిధ కూడళ్లలో ఆయన ఆధ్వర్యంలో వాహన తనిఖీలు శనివారం సాయంత్రం నిర్వహించారు. ప్రధానంగా యువత మద్యం మత్తులో వాహనాలు వేగంగా నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.