VSP: జిల్లాలోని ఈవీఎం గోదాముల వద్ద సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గ్రామీణ మండలం చినగదిలిలో ఉన్న ఈవీఎం గోదాములను ఆదివారం భీమిలి ఆర్డీఓ సంగీత్ మాధుర్ వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలిసి సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులను గమనించారు. సీసీ కెమెరాల పనితీరును ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు.