GNTR: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 31వ తేదీన పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేటలోని యల్లమంద గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై గురువారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.