ప్రకాశం: మండలం కేంద్రమైన సంతమాగులూరులోని గ్రంథాలయ శాఖలో ఆదివారం లైబ్రేరియన్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్పై శిక్షణ ఇచ్చారు. అనంతరం క్విజ్, డిబేట్, వ్యాస రచన వంటి పోటీలు నిర్వహించారు.