కర్నూలు: జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. వారితో ఎస్పీ ఆప్యాయంగ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. నేటి కార్యక్రమంలో మొత్తం 93 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు.