TPT: ఉపాధి హామీలో గత ఏడాది చేపట్టిన పనులపై జరిగిన సామాజిక తనిఖీలోని వివరాలను వెల్లడించేందుకు మంగళవారం ఉదయం పాకాల మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ అరుణ తెలిపారు. లబ్దిదారులు, కూలీలు, రైతులు హాజరు కావాలని.. సమస్యలుంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.