CTR: నగరి మున్సిపల్ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్ బాలాజీ నాయక్ తెలిపారు. నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటిని పరిష్కరిస్తామన్నారు. ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.