సత్యసాయి: నల్లచెరువు మండల పరిధిలోని దేవిరెడ్డిపల్లి ఆదర్శ పాఠశాల సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు ద్విచక్ర వాహనాన్ని టాటా ఏసీ వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో గాయపడిన వ్యక్తి నల్లచెరువుకు చెందిన నాగభూషణగా స్థానికులు గుర్తించారు. 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.