KRNL: గోనెగండ్ల పరిధిలోని గంజిహళ్లిలో వెలసిన హజరత్ మహాత్మా బడే సాహెబ్ నెల ఉర్సు మహోత్సవం ఘనంగా జరుగుతోంది. దర్గాను దర్శించుకోవడానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని దర్గా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు చిన్న ముదుగోలు తెలిపారు.