KNRL: దేవనకొండ మండలం వెంకటాపురంలో లక్ష్మి (23) శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి లలిత తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మి కర్నూలుకు చెందిన మనోహర్తో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. భర్త ప్రతిరోజూ లక్ష్మిని వేధించేవాడని ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందని లలిత ఫిర్యాదు చేసింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.