GNTR: అక్రమ మైనింగ్ కేసులో తీర్పు ఆలస్యం అయినప్పటికీ, నేరస్తులు మాత్రం తప్పించుకోలేరని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మంగళవారం వ్యాఖ్యానించారు. ఓబులాపురం అక్రమ మైనింగ్పై 2004-2009 మధ్య టీడీపీ నేతృత్వంలో పోరాటం చేసిన తమకు నేడు ఫలితం దక్కినట్లు తెలిపారు. సీబీఐ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరన్నారు.