కోనసీమ: రానున్న నాలుగేళ్ల కాలంలో కోనసీమ వాసులకు రైల్వే కూత వినిపిస్తామని ఎంపీ గంటి హరీష్ హామీ ఇచ్చారు. మంగళవారం ముమ్మిడివరం మండలంలో నిర్వహించిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను MLA దాట్ల బుచ్చిబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. కొండాలమ్మ చింత నుంచి బాలయోగేశ్వరుల గుడి వరకు రూ.1.68 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును వారు ప్రారంభించారు.