GNTR: జిల్లా క్రికెట్ సంఘం అండర్-23, సీనియర్ జట్ల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు మే 10న అరండల్పేటలోని పిచ్చుకులగుంట మైదానంలో ఉదయం 8 గంటల నుంచి అండర్-23 ఎంపిక పోటీలు జరుగుతాయి. అనంతరం మే 11న సీనియర్ జట్టు ఎంపికలు నిర్వహిస్తారు. క్రికెటర్లు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలు, వ్యక్తిగత క్రికెట్ కిట్తో హాజరుకావాలని GDCA సభ్యుడు మహతీ శంకర్ తెలిపారు.