CTR: నగరి కీలపట్ల వద్ద డ్యామేజ్ అయిన లోలెవల్ బ్రిడ్జిను సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, నగరి MLA గాలి భాను ప్రకాష్తో కలిసి పరిశీలించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా రాకపోకలకు ఇబ్బందులు లేకుండా లో లెవెల్ బ్రిడ్జ్ మరమ్మతులు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆర్ అండ్ బి అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.