E.G: కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల వల్ల బీజేపీకి మరింత బలం చేకూరుతుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. బీజేపీ నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాత్రి రాజమండ్రిలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.