KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గురువారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకు మున్సిపల్ మాజీ ఇన్ఛార్జ్ ఛైర్మన్ ముక్తియార్ వినతిపత్రం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, కొత్త కూరగాయల మార్కెట్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ఉర్దూ స్కూళ్ళలో టీచర్ల కొరతను పరిష్కరించాలన్నారు.