BPT: పిట్టలవానిపాలెం మండలంలో ఇద్దరు నూతన పంచాయతీ కార్యదర్శులు నియమితులయ్యారు. పిట్టలవానిపాలెం గ్రామపంచాయతీ నూతన కార్యదర్శిగా షేక్ అక్బర్ బాషా నియమితులయ్యారు. అలాగే, మండల పరిధిలోని సంగుపాలెం గ్రామపంచాయతీ కార్యదర్శిగా సీహెచ్.సురేష్ బాబును నియమించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.