ప్రకాశం: దేశంలోనే పూర్తిస్థాయి స్పెర్మ్ వేల్ అస్థిపంజరం ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని జంతుశాస్త్ర ప్రయోగశాలలో ఉంది. 1983, డిసెంబర్ 9న పెదగంజాం తీరానికి కొట్టుకొచ్చిన 35 అడుగుల పొడవు, 30 టన్నుల బరువున్న ఈ తిమింగలం కళేబరాన్ని విద్యార్థుల అవగాహన కోసం కళాశాలకు తరలించారు. దీన్ని ప్రభుత్వం సంరక్షించాలని అధ్యాపకులు కోరుతున్నారు.