TPT: తిరుపతిలోని శ్రీకోదండరామ స్వామివారి ఆలయం నవమి శోభను సంతరించుకుంది. రాములవారి దర్శనార్థం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణలతో రామాలయం వెలిగిపోతోంది. ఉదయం నుంచి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ మంచి నీరు, మజ్జిగ పంపిణీ చేసింది.