PPM: భారత రాజ్యాంగ నిర్మాత డా,బి.ఆర్.అంబేద్కర్ జయంతి సోమవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈమేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళితో కార్యక్రమం ప్రారంభంమవుంతుదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొంటారని చెప్పారు.