E.G: పశువులకు గ్రాసంగా వినియోగించే ఎండుగడ్డి దొరకడం గగనంగా మారిందని చాగల్లు పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎకరా ఎండుగడ్డి రూ. 8వేల వరకు పలుకుతోంది. గతంలో కూలీలతో వరి కోయించడం వల్ల గడ్డికి కొరత ఉండేది కాదు. అయితే ఇటీవల కాలంలో వరి కోత యంత్రాల వినియోగం పెరగడంతో గడ్డి మొత్తం నిరూపయోగంగా మారడంతో తీవ్ర కొరత ఏర్పడింది.