కోనసీమ: కే.గంగవరం (పామర్రు) మండలంలోని బ్రహ్మపురి గ్రామానికి చెందిన మేడ ఏడుకొండలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఏడుకొండలకు మంజూరు అయిన రూ.30 వేలు నగదు చెక్కును రామచంద్రాపురంలోని కార్యాలయం వద్ద సోమవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆయనకు అందజేశారు.