SKLM: కొత్తూరు మండల కేంద్రంలో రామాలయం మఠంలో యోగాంద్ర – 2025 కార్యక్రమంలో భాగంగా సోమవారం యువకులంతా కలిసి యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా లోతుగెడ్డ ఇందిర రామ్ మాట్లాడుతూ.. యోగాతో శరీరం మన ఆధీనంలో ఉంటుదని, తద్వారా ఎటువంటి అనారోగ్యం గురికాకుండా ఉంటామని తెలిపారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖకు నరేంద్ర మోడీ రానున్నారని తెలిపారు.