KKD: డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు వచ్చే సమస్యల అర్జీల పరిష్కారానికి సత్వరం చొరవ చూపాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, నగరపాలక అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి కమిషనర్ భావన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది కమిషనర్కు తమ సమస్యలు వివరించారు.