PPM: జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో వ్యవసాయ, ఉద్యానవన పంటలను వేసి, ఆ గ్రామాలకు ఆదాయం వచ్చేలా ఆలోచన చేస్తున్నామని కలెక్టర్ డా, ప్రభాకర రెడ్డి తెలిపారు. అందుకు తగిన విధంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.