SKLM: శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామం నుంచి స్మశాన వాటిక వరకు రోడ్డు పనులకు మోక్షం లభించింది. ఎన్నో దశాబ్దాలుగా స్మశాన వాటికకు వెళ్లేందుకు గ్రామస్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన స్థానిక సర్పంచ్ గుండ ఆదిత్య నాయుడు స్మశాన వాటిక రోడ్డు పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.