KRNL: జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి శ్రీ మఠంలో గత 22 రోజులలో భక్తులు సమర్పించిన కానుకలను అధికారులు లెక్కించారు. మఠం అధికారుల వివరాల ప్రకారం.. మొత్తం రూ. 3,35,31,756 నగదు రూపంలో ఆదాయం నమోదయ్యింది. దీంతో పాటు 1.440 కిలోల వెండి, 7.4 తులాల బంగారం, వివిధ దేశాల కరెన్సీ కూడా కానుకలుగా వచ్చినట్లు తెలిపారు.